36.2 C
Hyderabad
April 25, 2024 20: 41 PM
Slider ముఖ్యంశాలు

గ్రానైట్ వ్యాపారులకు నోటీసులు

#ED

హైదరాబాద్‌, కరీంనగర్‌లోని గ్రానైట్‌ సంస్థల్లో సోదాలు నిర్వహించిన ఈడీ ఆయా సంస్థల యజమానులు తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఎవరెవరు ఎప్పుడెప్పుడు విచారణకు హాజరుకావాలనేది తేదీలతో కూడిన వివరాలను నోటీసులో పొందుపర్చింది. ఈడీ నోటీసులు అందుకున్న వారిలో మొట్టమొదటగా పీఎ్‌సఆర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యజమాని పాలకుర్తి శ్రీధర్‌ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో  విచారణకు హాజరయ్యారు. పలు అంశాలపై ఆయన్ను ఈడీ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా పలు పత్రాలు పరిశీలించారు. అవసరమైతే మరోసారి విచారణకకు హాజరుకావాల్సి ఉంటుందని చెప్పి పంపించారు. వచ్చే వారం నుంచి వరుసగా ఆయా గ్రానైట్‌ సంస్థలకు చెందిన యజమానులు ఒక్కొక్కరుగా ఈడీ అధికారుల ఎదుట పూర్తి పత్రాలతో హాజరుకానున్నారు.

Related posts

నిరుపేద అమ్మాయి పెళ్లికి అండగా ఉప్పల

Satyam NEWS

మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ దుర్మరణం

Satyam NEWS

కష్టపడి పని చేసేవారికి గతంలో కొన్ని జబ్బులు వచ్చేవి కావు

Satyam NEWS

Leave a Comment