తిరుపతి లోక్ సభ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల కాబోతున్నది.
తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి సాధారణ ఎన్నికలలో గెలిచిన వైసీపీ నాయకుడు బల్లి దుర్గాప్రసాద్ అకస్మిక మరణం కారణంగా ఆ స్థానం ఖాళీ అయింది.
ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ ఉప ఎన్నిక జరగబోతున్నది. తెలుగుదేశం పార్టీ ఈ స్థానానికి ఇప్పటికే తన అభ్యర్ధిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని ప్రకటించింది.
అధికార వైసీపీ తన అభ్యర్ధిగా గురుమూర్తిని ప్రకటించింది. జనసేన, బిజెపి తన అభ్యర్ధిని ప్రకటించాల్సి ఉంది.