39.2 C
Hyderabad
March 29, 2024 14: 54 PM
Slider కడప

కరోనా హెల్ప్: బియ్యం పంపిణీ చేసిన ప్రవాసాంధ్రులు

NRI Rajampet

కరోనా లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న కడప జిల్లా రాజంపేట మండలం కొమ్మి వారి పల్లె హరిజనవాడ,సింగన వారిపల్లె అరుంధతి వాడల్లో శనివారం ప్రవాసాంధ్రులు బియ్యం బస్తాల పంపిణీ చేశారు. అబుదాబి నుంచి వచ్చిన యలమంచి ప్రదీప్, మెడికొండ రమణయ్య నాయుడు,మెడికొండ బాలకృష్ణ, మెడికొండ సాయిరామ్ లు ఈ కార్యక్రమం చేపట్టారు.

రాజంపేట రూరల్ ఎస్సై హనుమంతు చేతుల మీదుగా 140 కుటుంబాలకు 25 కేజీల నాణ్యమైన బియ్యం బస్తాలను అందజేశారు. స్వంత గ్రామాల్లో పేద వారికి ఉచితంగా బియ్యం పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చిన ఎన్నారై యువతను ఎస్సై హనుమంతు అభినందించారు.

Related posts

విజయనగరంలో డ్రగ్స్ కలకలం: ఇద్దరి అరెస్టు

Satyam NEWS

ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంసా పత్రాలు

Satyam NEWS

అంకిత్ శర్మ హత్యకేసులో తాహిర్ హుస్సేన్ అరెస్టు

Satyam NEWS

Leave a Comment