కరోనా లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న కడప జిల్లా రాజంపేట మండలం కొమ్మి వారి పల్లె హరిజనవాడ,సింగన వారిపల్లె అరుంధతి వాడల్లో శనివారం ప్రవాసాంధ్రులు బియ్యం బస్తాల పంపిణీ చేశారు. అబుదాబి నుంచి వచ్చిన యలమంచి ప్రదీప్, మెడికొండ రమణయ్య నాయుడు,మెడికొండ బాలకృష్ణ, మెడికొండ సాయిరామ్ లు ఈ కార్యక్రమం చేపట్టారు.
రాజంపేట రూరల్ ఎస్సై హనుమంతు చేతుల మీదుగా 140 కుటుంబాలకు 25 కేజీల నాణ్యమైన బియ్యం బస్తాలను అందజేశారు. స్వంత గ్రామాల్లో పేద వారికి ఉచితంగా బియ్యం పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చిన ఎన్నారై యువతను ఎస్సై హనుమంతు అభినందించారు.