విద్యార్థులకు చదువుతో పాటు సామాజిక సేవను కూడా అలవాటు చేయాలనే ఉద్దేశ్యంతో కామారెడ్డి జిల్లా మానేపూర్, సీతారాం పల్లిలో ఎన్ఎస్ఎస్ శిబిరం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల బిచ్కుంద వారి ఆధ్వర్యంలో (NSS) జాతీయ సేవ పథకం యూనిట్ 1, యూనిట్ 2 ఆధ్వర్యంలో మాన్యపూర్, సీతారామపల్లి గ్రామాలలో ఈ ప్రత్యేక శిబిరం శనివారం ఏర్పాటు అయింది.
ఈ కార్యక్రమంలో మాన్యపూర్ గ్రామ సర్పంచ్ దాసరి రాములు, సీతారాం పల్లి గ్రామ సర్పంచ్ గంగారెడ్డి, కళాశాల అకడమిక్ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్, గ్రామ కార్యదర్శులు మనోజ్, షోహెబ్, NSS కార్యక్రమ అధికారులు సంజీవరెడ్డి ,డా. జీ .వెంకటేశం, వాలంటీర్లు ,గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. విద్యార్ధులను సేవ కార్యక్రమంలో కూడా పాలు పంచుకునేటట్టు ప్రోత్సహించడానికి ఈవిధమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని వక్తలు తెలిపారు.
జి.లాలయ సత్య న్యూస్ జుక్కల్ నియోజకవర్గం