కడప జిల్లా రాజంపేట లో స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సోమవారం అన్న దానం,రక్తదానం, పాలాభిషేకం, దుస్తుల పంపిణి కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాత్యాల చెంగల రాయుడు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొదట తాళ్ళపాక పంచాయతీ లోని హేమాద్రివారిపల్లె లో పేదలకు దుస్తుల పంపిణి చేశారు.
అనంతరం రాజంపేట పట్టణంలోని బైపాస్ రోడ్డు లోని ఎన్టీఆర్ విగ్రహానికి నీటితో శుద్ధి చేసి పాలాభిషేకం చేశారు.గజమాల వేశారు.జోహార్ ఎన్టీఆర్ అంటూ వినాదాలు చేశారు.
పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహం ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో పేద ఎత్తున కార్యకర్తలు పాల్గొని రక్తాదానం చేశారు.
అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు యద్దల సుబ్బారాయుడు, పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు అనసూయమ్మ,
భారతాల శ్రీధర్ బాబు యాదవ్, డాక్టర్ సుధాకర్, బషీర్,కరిముల్లా ,పీరు,యన్టీఆర్ కేశవ,రేవూరి వేణు గోపాల్,శివ కుమార్, సుబ్రహ్మణ్యం నాయుడు,ఇడిమడకల కుమార్,వెంకటేశ్వర్లు నాయుడు తదితరులు పాల్గొన్నారు.