కరోనా వైరస్ ను అరికట్టడం కోసం ముందు వరుసలో వుండి సమాజ సేవ చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి, ఆశా వర్కర్లకు, ANM లకు, వైద్య సిబ్బందికి, పోలీసులకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అత్యంత నాణ్యతా ప్రమాణాలు కలిగిన SS 96 మాస్కులు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
ఆ మాస్కులను అన్ని జిల్లాలకు పంపారు. వాటిని ఈ రోజు కోవూరు గ్రామపంచాయతీ సిబ్బందికి, ఆశ వర్కర్లు కు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అందచేశారు. అదేవిధంగా పోలీసులకు కోవూరు పోలీసుస్టేషన్ లో CI సమక్షంలో అందించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ కోవిద్ 19 కు వ్యతిరేకం గా ముందు వరుసలో పనిచేస్తున్న సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏలూరు కృష్ణయ్య, పెనుమల్లి శ్రీహరి రెడ్డి, పంతంగి రామారావు, జొన్నదుల రవికుమార్, మారుబోయిన వెంకటేశ్వర్లు, ఇందుపురు మురళీకృష్ణ రెడ్డి, కలికి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.