తెలంగాణలో రాచరిక పాలన సాగుతోందని బీజేపీ సెంట్రల్ కో-ఆర్డినేటర్ (TS) నూనె బాల్ రాజ్ అన్నారు. TRS ప్రభుత్వం ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తుందని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడం అత్యంత దారుణమని, ఇంత నిరంకుశ ప్రభుత్వం ఇంతకుముందు చూడలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారని, కోవిడ్ రూల్స్ సాకుగా చూపిస్తూ అనుమతి ఇవ్వడం లేదని చెబుతున్నారని ఆయన అన్నారు. పోలీసుల తీరు మార్చుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాల్ రాజ్ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బిజెపి పార్టీనే అనే విషయం పోలీసులు గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు.
previous post