కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో వివిధ ప్రభుత్వ వైద్యశాలలో పని చేస్తున్న నర్సులకు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసింది. ట్రైన్డ్ నర్సస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ నర్సస్ అసోసియేషన్ ఈ కార్యక్రమానికి సహకారం అందించారు. హైదరాబాద్ లోని ENT హాస్పిటల్, కోఠి హాస్పిటల్ , ఛాతి హాస్పిటల్, ESI హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, కోఠి మెటర్నిటీ హాస్పిటల్ లలో పని చేస్తున్న నర్సులకు మస్కులు, శానిటైజర్ లు అందించామని నర్సింగ్ ఆఫీసర్ అసోసియేషన్ లక్ష్మణ్ రూడవత్ తెలిపారు.
కోవిడ్-19 వార్డ్ లో పనిచేస్తున్న వీరికి అండగా మేమున్నామని చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో TNAI తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ రాజేశ్వరి, నర్సింగ్ ఆఫీసర్ అసోసియేషన్ సలహాదారులు డాక్టర్ రామ్ తిలక్, తెలంగాణ నర్సస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుజాత, అధ్యక్షులు రామ లక్ష్మీ పాల్గొన్నారు.