విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన శిరోముండనం కేసులో ప్రధాన నిందితుడైన సినీ డైరెక్టర్ నూతన నాయుడును అనకాపల్లి సబ్ జైలుకు తీసుకువచ్చారు.
కర్నాటకలో ని ఉడిపి లో నూతన నాయుడిని అరెస్ట్ చేశారు. ఆయన దగ్గర మూడు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక లో కోర్టుకి పంపించి రిమాండ్ చేశారు.
అక్కడ నుంచి నేటి ఉదయం అనకాపల్లికి తీసుకువచ్చారు. శిరోమండనం కేసులు అతని పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నూతన నాయుడు పై ఎస్ సి ,ఎస్ టి కేసు నమోదు చేశారు.