కేంద్ర ప్రభుత్వ విద్యా, ఉద్యోగాల్లో OBC రిజర్వేషన్లను కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన సోనియాగాంధీకి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతలు తెలిపింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ OBC అధ్యక్షుడు శెట్టి రామచందర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం ఆమోదించారు.
తెలంగాణ రాష్ట్ర OBC వైస్ చైర్మన్ యరగాని నాగన్న గౌడ్ తదితర నాయకులు మాట్లాడుతూ దేశంలో 50శాతానికి పైగా జనాభా ఉన్న బలహీనవర్గాల అభ్యున్నతికి సోనియాగాంధీ లేఖ రాసి OBCల పట్ల శ్రద్ధా పూర్వక ప్రేమాభిమానాలు వ్యక్తం చేశారని వారన్నారు.
తన నిబద్ధత చాటుకున్న ఏఐసిసి అధ్యక్షురాలు, తెలంగాణ తల్లిగా భావించే సోనియా గాంధీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాశం రామరాజు, పోతనబోయిన రామ్మూర్తి, ములకలపల్లి రామగోపి పాల్గొన్నారు.