24.7 C
Hyderabad
March 29, 2024 05: 24 AM
Slider తూర్పుగోదావరి

తుఫాను హెచ్చరిక నేపధ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావాలి

#harikiranias

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా  రానున్న మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపద్యంలో  జిల్లా యంత్రాంగం, ప్రజలు ముందు జాగ్రత్తలతో అప్రమత్తం కావాలని తూర్పుగోదావరి జిల్లా జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కోరారు.       

మధ్య అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా బలపడి వాయువ్య దిశలో కదులుతూ ఈ నెల 4వ తేదీ ఉదయానికి ఉత్తరాంధ్ర-ఒడిస్సా తీరాన్ని తాకనుందని, దీని ప్రభావం వల్ల డిశంబరు 3 నుండి 5వ తేదీ వరకూ తూర్పు గోదావరి జిల్లాలో బలమైన గాలులతో భారీ వర్షపాతం నమోదు కానుందని వాతావరణ  హెచ్చరిక జారీ అయిందని ఆయన తెలిపారు.

తుఫాను హెచ్చరిక నేపద్యంలో మత్స్యకారులు ఎవ్వరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించాలని, ఇప్పటికే సముద్రంలో ఉన్న వారిని వెంటనే తీరానికి చేరుకునేలా చర్యలు చేపట్టాలని మత్య్సశాఖ అధికారులను ఆదేశించారు.  పెనుగాలుల వల్ల ప్రమాదాలు సంభవించకుండా  పూరిళ్లు, తాటాకు, పెంకుటిల్లలో నివశిస్తున్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆయన కోరారు.

పిడుగులు పడే అవకాశం ఉంది జాగ్రత్త

అలాగే వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల క్రింద ఉండవద్దని హెచ్చరించారు. రానున్న 2,3 రోజులలో భారీ వర్షాల వల్ల ఏజెన్సీ ప్రాంతంలోని వాగులు, వంకలు పొంగి పొర్లే ప్రమాదం ఉందని, కావున ప్రసవ తేదీకి దగ్గరలో ఉన్న గర్భవతులందరినీ సమీప ప్రభుత్వ ఆసుపత్రులలోని ప్రసవ నిరీక్షణ గదులకు తరలించాలన్నారు. గంటకు 80 కి.మీ. వేగంతో తుఫాను ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున, చెట్లు విద్యుత్ స్థంబాలు కూలి రహదార్లకు అంతరాయం ఏర్పడే అవకాశం దృష్ట్యా ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.

రవాణా అవరోధాలను తొలగించేందుకు అవసరమైన జెసిబిలు, పవర్ కట్టర్లు, రంపాలు, ట్రాక్టర్లను సిద్దంగా ఉంచాలని ఆయన అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయాల వల్ల త్రాగునీటి సరఫరాకు ఆటంకం కలుగకుండా జనరేటర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కమ్యూనికేషన్ వ్యవస్థలు అన్ని ఎటువంటి  అంతరాయం లేకుండా సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు.  

రెవెన్యూ, అగ్నిమాపక, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, పంచాయితీరాజ్, రోడ్లు భవనాలు, పోలీస్ తదితర రక్షణ,సహాయ శాఖలకు సెలవులు రద్దు చేసి, అధికారులు, సిబ్బంది అత్యవసర విధులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తుఫాను హెచ్చరికలను మీడియా, వలంటీర్ల వ్యవస్థ, టాంటాం ద్వారా ప్రజలకు ఎప్పటి కప్పుడూ తెలియజేయాలని, మండల ప్రత్యేక అధికారులు తమతమ మండల కేంద్రాలలో ఉండి ముందస్తు జాగ్రత్తలను, సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు.

ముందు జాగ్రత్తగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలకు ఈ నెల 4వ తేదీన స్థానిక శెలవు దినం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  కలెక్టరేటులోను, అన్ని డివిజన్ కేంద్రాలలోనూ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని తుఫాను పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు, కంట్రోల్ రూమ్ కు సమాచారం తెలియజేయాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందకు  ప్రమాణిక విపత్తు నియంత్రణ కార్యాచరణలను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

కంట్రోల్ రూమ్ నంబర్లుః   

1. జిల్లా కలెక్టరు కార్యాలయం, కాకినాడ 1800-425-3077

2. ఆర్డిఓ, కాకినాడ కార్యాలయం 0884-2368100

3.ఆర్డిఓ, అమలాపురం కార్యాలయం 08856-233208

4.ఆర్డిఓ, రామచంద్రపురం కార్యాలయం 08857-245166

5.ఆర్డిఓ, పెద్దాపురం కార్యాలయం 9603663227

6.పిఓ.ఐటిడిఏ, రంపచోడవరం కార్యాలయం 1800-425-2123

7.సబ్ కలెక్టర్, రంపచోడవరం కార్యాలయం 08864-243561

8.సబ్ కలెక్టర్, రాజమండ్రి కార్యాలయం 0883-2442344

9.ఆర్డిఓ, ఎటపాక కార్యాలయం 08864-285999, 7331179

Related posts

బిసి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు మరిన్ని వసతులు

Bhavani

ఒక పెళ్లి, ఒక చావు వెరసి 111 మందికి కరోనా

Satyam NEWS

ప్రకాశం బ్యారేజ్ కు కొనసాగుతున్న వరద

Satyam NEWS

Leave a Comment