భూకబ్జాదారుడు, తెరాస నేత,జెడ్పిటిసి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి పైన అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని యాదవ హక్కుల పోరాట సమితి నిర్మల్ జిల్లా పట్టణ అధ్యక్షుడు మంచాల శ్రీకాంత్ యాదవ్ అధికారులను డిమాండ్ చేశారు. ఆదివారం నిర్మల్ పట్టణ పరిధిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని నెల్లికుదుర్ మండలం నర్సింహుల గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని సర్వేనెంబర్ 21లోని భూమినికబ్జాకు పాల్పడుతున్న జెడ్పిటిసి పైన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా నేటికి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఏంటని నిలదీశారు. అంతేగాక తమ కబ్జాను అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన రైతు నమ్ముల బిక్షం పైన అతని అనుచరులు దాడి చెయ్యడం దారుణం అని అన్నారు.రోజురోజుకు భూకబ్జాలు పెరిగిపోతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం భూకబ్జాదారులపైన ఉక్కుపాదం మోపాలని అన్నారు.