నిన్న రాత్రి కురిసిన వర్షాలకు హైదరాబాద్ లోని హుడా కాంప్లెక్స్ లో డ్రైనేజ్ పొంగి పొర్లింది. కొన్ని అపార్ట్మెంట్ లలోని సెల్లార్లలో వరద నీరు పొంగి ప్రవహిస్తున్నది.
విషయం తెలుసుకున్న మంత్రి సబితాఇంద్రా రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు హుడా కాంప్లెక్స్ లో పర్యటించి సమస్యలు తెలుసుకున్న డి.సి.కృష్ణయ్య, ఇ.ఇ. హరిలాల్ హుటాహుటిన ఆ ప్రాంతంలో పర్యటించారు.
కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ టి ఆర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు లోకసాని కొండల్ రెడ్డి, హుడా షా అసోసియేషన్ అధ్యక్షులు అనూప్ రాజ్, ఉద్యమ నాయకులు కొండా గిరిగౌడ్, గుండె నాగరాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.