32.2 C
Hyderabad
March 29, 2024 01: 08 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఈఎస్ఐ మందుల కుంభకోణంలో తనిఖీలు

Udayalaxmi

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేకెత్తించిన రూ. 300 కోట్ల  ఈఎస్ఐ మందుల కుంభకోణం లో దర్యాప్తులో భాగంగా బుధవారం విజయవాడలోని డైరెక్టరేట్ కార్యాలయంలో కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి ఉదయాలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు. అంతే కాకుండా కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. కొద్ది కాలం కిందట ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐ లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. మందుల కొనుగోళ్లలో ఏకంగా వందల కోట్లలో అక్రమాలు జరిగినట్లు బయటపడింది. మందులు సరఫరా చేయకుండానే కోట్లు కొట్టేసేందుకు కొందరు ప్రణాళికలు రచించారు. ఏకంగా 300 కోట్ల మందులు, వైద్య సామాగ్రి కొనుగోళ్లపై అక్రమాలు జరిగినట్లు నిర్ధారించిన కార్మికశాఖ విచారణకు ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే సమయంలో ఈఎస్ఐలో మెడిసిన్స్ కొనుగోలులో భారీ కుంభకోణం బట్టబయలైంది. మందులు, వైద్యపరికరాల కొనుగోలులో ఎలాంటి నిబంధనలు పాటించకుండా అధికర ధరలకు మందులు కొనుగోలు చేసి సుమారు రూ.200 కోట్లు కుంభకోణానికి తెరతీశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణియే సూత్రధారి అని నిర్ధారణ అయింది. అర్హతలు లేని ఏజెన్సీల నుంచి మందులు కొనుగోలు చేసి ప్రభుత్వ సొమ్మును కాజేశారు.

Related posts

కేసీఆర్ నన్ను మనిషిగానే చూడలేదు – వేముల వీరేశం

Bhavani

నెల్లిమర్ల డైట్ కాలేజ్ సమీపంలో అక్రమంగా ప్రార్ధనాలయం…!

Satyam NEWS

డివైన్ వర్డ్: మహాభారత కావ్య పఠనం ముక్తి కి మార్గం

Satyam NEWS

Leave a Comment