హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న బాగ్ అంబర్ పెట్ డివిజన్లోని డీడీ కాలనీ నారాయణ కాలేజ్ కి వెళ్లే రోడ్డులో మరి చాలా రోజుల నుంచి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ చైనీస్ ఫుడ్స్ దొరుకుతాయి.
సాయంత్రం అయ్యిందంటే చాలు ఇక్కడ జాతర సాగుతుంది సగం రోడ్డు ఆక్రమించి ఉంటున్నారు. కానీ ఎవరు అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు మరి ఇక్కడ పనిచేసే వాళ్లకు కూడా మాస్క్ ఉండదని అరోపిస్తున్నారు.
ప్రభుత్వం ఖచ్చితంగా మాస్క్.. లేకపోతే 1000 రూపాయలు ఫైన్ ప్రతిరోజూ చెప్తున్నారు కానీ ఇక్కడ అధికారులు మాత్రం తొంగి కూడ చూడడం లేదన్నారు.
ఎలాగైనా సరే ఏఎంహెచ్ఓ అధికారి ఇక్కడికి వచ్చి చెక్ చేసి… స్థాయి సిబ్బందిని పంపించాలని ప్రజలు మాస్క్ పెట్టుకుని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు.
అధికారులు వారికి వెయ్యి రూపాయలు ఫైన్ వేయాలని కోరారు. అలాగే బాగ్ అంబర్ పేట్ లో ప్రతిరోజు బస్తీలలో తిరుగుతూ సమస్యలను పరిష్కరిస్తు ఏదో ఒక సమస్య …… తిరుగుతున్నారు.
కాబట్టి ఇటువంటి ప్లేస్ ల్లోకి కూడా వచ్చి ప్రజలను చైతన్యపరిచే విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నారు.