బిచ్కుంద మండలంలోని మెక్క గ్రామాన్ని మండల పరిషత్ అధికారి ఎంపిడి ఓ ఆనంద్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించి మాస్కులు ధరించాలన్నారు. తర్వాత నర్సరీ ని పరిశీలించారు.
చివరగా వాటరింగ్ డే సందర్భంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు నీరు పోశారు. ప్రతి ఒక్కరూ తాము నాటిన మొక్కలకు నీరు పోసి బ్రతికించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ సయ్యద్ నవాజ్ పంచాయతీ కార్యదర్శి సతీష్ గ్రామ రెవెన్యూ అధికారి ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.