కడపజిల్లా జమ్మలమడుగు మండలం సుగమంచి పల్లి దగ్గర పెన్నానదిలో పురాతన ఆలయం బయటపడింది.
ఆలయానికి సంబంధించిన శాసనంతో పాటు ఇప్పటికే ఈ ప్రదేశంలోనే చాలా విగ్రహాలు బయటపడినట్లు గ్రామస్థులు వెల్లడించారు.
కట్టెలు కొట్టుకునే వ్యక్తికి పురాతన ఆలయం కనపడినట్లు సమాచారం. రాష్ట్ర కూటుల కాలం నాటి శివ దేవాలయంగా శాసనాన్ని బట్టి గుర్తించారు.
శివాలయం శాసనాల మీద 10వ శతాబ్దానికి సంబంధించిన సంస్కృత భాషతో పాటు కన్నడ లిపి చెక్కబడి ఉండటాన్ని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు.