34.2 C
Hyderabad
April 23, 2024 10: 59 AM
Slider కడప

వృద్ధాశ్రమానికి యాదవ సంఘం నిత్యావసర వస్తువులు

old age home

కడప జిల్లా సిద్దవటం మండలంలోని పరమాత్మ సేవా తపోవన ఆశ్రమంలో శనివారం అఖిల భారతీయ యాదవ మహాసభ భారతాల శ్రీధర్ ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి మూలంగా పేద వారిని ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం,నిత్యావసర వస్తువులు అంద జేస్తున్నారు.

 ఈ నేపధ్యంలో పరమాత్మ సేవా తపోవన ఆశ్రమంలో వృద్ధులకు అఖిల భారతీయ యాదవ మహాసభ భారతాల శ్రీధర్ ఆధ్వర్యంలో వీరికి బియ్యం, నిత్యావసర వస్తువులను అందచేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి రాజంపేట ఆర్డీవో ధర్మచంద్రా రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో రాజంపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గొబ్బిళ్ళ త్రినాథ్, సిద్దవటం ఎమ్మార్వో రామా కుమార్, సిద్దవటం ఎస్సై,జిల్లా యాదవ సంఘం నేతలు బాలకృష్ణ యాదవ్,తుంటి రమణయ్య, చుక్కా యానాది,మాజీ సర్పంచ్ కోనపురం నరిసింహులు తదితరులు పాల్గొన్నారు.

ఆశ్రయం నిర్వాహకులు మలిశెట్టి వెంకట రమణ ను,నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన శ్రీధర్ ను ఆర్డీవో అభినందించారు. దాతలు మరింత మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Related posts

మూడు రోజులుగా నందలూరు లో త్రాగునీటి ఇక్కట్లు

Satyam NEWS

పోడు భూముల రైతుల సమస్య ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి

Satyam NEWS

అజారుద్ధీన్ ను పరామర్శించిన మంత్రి హరీశ్ రావు

Bhavani

Leave a Comment