అన్నమయ్య జిల్లా మదనపల్లి టౌన్ విషాదం చోటు చేసుకున్నది. సివిల్ మ్యాటర్ లో తలదూర్చిన పోలీసులు ఈ ఘటనకు బాధ్యత వహించాలని స్థానికులు అంటున్నారు. తంబళ్లపల్లి మండలంలోని మొరుసుపల్లి బురుజుకు చెందిన గుట్టపాలెం నరసింహులు నాయుడు (70), అతని భార్య జి.వెంకటసుబ్బమ్మ (60) పోలీసుల వేధింపుతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని కోరుతూ నరసింహులు తమ్ముడు అప్పళ్ల తంబళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తంబళ్లపల్లి పోలీసులు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ రావాలని దంపతులను బెదిరించడంతో వృద్ధ దంపతులు భయపడ్డారు. దీంతో తంబళ్లపల్లి, మదనపల్లిలలో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆత్మహత్య చేసుకున్న దంపతులది స్వగ్రామం తంబళ్లపల్లి మండలంలోని మొరుసుపల్లి బురుజు. ప్రస్తుతం వీళ్ళు కాపురం ఉంటున్నది మదనపల్లి పట్టణం అనుపగుట్ట. దంపతులు ఇద్దరు విషం తాగి మదనపల్లిలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందారని మృతుని బంధువులు కుటుంబ సభ్యులు తెలిపారు.
previous post