గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కృష్ణానదిలో ఒక వృద్ధుడు కుటుంబ సభ్యులు చూస్తుండగానే దూకేశాడు. కనకదుర్గమ్మ వారధి వద్ద పై కృష్ణమ్మకు పూజలు నిర్వహిస్తానని చెప్పి వచ్చిన ఆ వృద్ధుడు ఒక్కసారిగా నదిలోకి దూకాడు.
కుటుంబ సభ్యులు ఆ సమయంలో ఆయనను వీడియో తీస్తున్నారు.
దుర్గాప్రసాద్ అనే వ్యక్తిగా అతనిని గుర్తించారు. తనకు ఆరోగ్యం బాగోనందునే ఆత్మహత్యకు పాలపడుతున్నట్లు దుర్గాప్రసాద్ సూసైడ్ నోట్ రాసుకున్నాడు.
గల్లంతైన వృద్ధుని కోసం అధికారుల గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.