32.7 C
Hyderabad
March 29, 2024 11: 48 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఒక సలహాదారుడిపై ఏపీ సర్కార్ వేటు

#YSJaganmohanReddy

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లెక్కకు మించిన సలహాదారులు ఉన్నారు. వారిలో ఒకరిపై ఇప్పుడు ప్రభుత్వం వేటు వేసింది. పోలవరం ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారు హెచ్‌కే సాహును విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్‌లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారుగా సాహును 2018 ఏప్రిల్‌ 148న ఏపీ ప్రభుత్వం నియమించింది. అయితే ఆయన పనితీరు సంతృప్తికరంగా లేదని ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు సీఈ నివేదిక పంపారు. దీంతో కన్సల్టెంట్‌గా సాహును తొలగించే ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది.

Related posts

ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం: సీరీస్ కైవసం

Satyam NEWS

కలెక్టర్ నారాయణ రెడ్డితో సర్పంచ్ ల సంఘం భేటీ

Satyam NEWS

డిమాండ్లు నెరవేర్చిన వారికే ఓటు: బీసీ ఫెడరేషన్

Satyam NEWS

Leave a Comment