కర్నూలు జిల్లా లో దారుణం జరిగింది. బుధవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాపిరేవుల టోల్ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి ఎస్బీఐ ఉద్యోగి సజీవదహమయ్యాడు. ఎస్సై సుధాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఎస్బీఐ ఉద్యోగి శివకుమార్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి హైదరాబాద్కు నుంచి నంద్యాలకు కారులో బయలుదేరారు.
కర్నూలు జిల్లాలోని నంద్యాల సమీపంలో ముందుగా వెళ్తున్న కంటైనర్ను వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఢీకొట్టింది. దీంతో కారు కంటైనర్లో ఇరుక్కుపోయింది. ప్రమాదాన్ని కంటైనర్ డ్రైవర్ గమనించకపోవడంతో కారును సుమారు 3 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది.
ఈ క్రమంలో నంద్యాల మండలం చాపిరేవుల టోల్ప్లాజా వద్ద కారులో మంటలు చెలరేగాయి. శివకుమార్(40) దివ్యాంగుడు కావడంతో కారులో నుంచి బయటకు రాలేక సజీవదహమయ్యాడు. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు.