అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ కొన్నాయి. రెండు లారీలు ఢీకొనడంతో వచ్చిన మంటలలో ఒకరు సజీవ దహనం అయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ ఘోరం జరిగింది.
మండలంలోని కడప రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒక లారీలో మంటలు వ్యాపించడంతో ఒకరు సజీవదహనం అయ్యారు. ఇంకా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.