37.2 C
Hyderabad
March 29, 2024 18: 44 PM
Slider కృష్ణ

కరోనా లక్షణాలు ఉన్నాయన్న భయంతో వ్యక్తి ఆత్మహత్య

#coronaeffect

కరోనా లక్షణాలు ఉన్నాయనే భయంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న దురదృష్టకర సంఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.

గన్నవరం మండలం మర్లపాలెం కు చెందిన 74 ఏళ్ల రాపర్ల హరిబాబు గత మూడు రోజులుగా జ్వరం ఇతర లక్షణాలతో బాధపడుతున్నాడు.

వ్యాధి లక్షణాలు చూసి అతనికి కరోనా వచ్చిందంటూ స్థానికులు హడావుడి చేశారు.

దాంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోకుండానే భయంతో గ్రామ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

గన్నవరం పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Related posts

విక్రమ్ లాండర్ ఆచూకీ తెలిసింది

Satyam NEWS

నరసరావుపేటలో ఇంటర్నేషనల్ స్థాయి డయాగ్నస్టిక్ సేవలు

Bhavani

ఘనంగా హారర్ థ్రిల్లర్ ఎస్ 5 నో ఎగ్జిట్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం

Bhavani

Leave a Comment