కరోనా లక్షణాలు ఉన్నాయనే భయంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న దురదృష్టకర సంఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.
గన్నవరం మండలం మర్లపాలెం కు చెందిన 74 ఏళ్ల రాపర్ల హరిబాబు గత మూడు రోజులుగా జ్వరం ఇతర లక్షణాలతో బాధపడుతున్నాడు.
వ్యాధి లక్షణాలు చూసి అతనికి కరోనా వచ్చిందంటూ స్థానికులు హడావుడి చేశారు.
దాంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోకుండానే భయంతో గ్రామ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
గన్నవరం పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.