పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ములుగు జిల్లా 5s సిస్టం ఇంచార్జ్ ఏఆర్ అడిషనల్ ఎస్పీ సిహెచ్. కుమార స్వామి అన్నారు.
ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ఆదేశాల మేరకు 5s సిస్టం ఇంచార్జ్ ఏఆర్ అడిషనల్ ఎస్పీ సిహెచ్. కుమార స్వామి పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని పోలీస్ హెడ్క్వార్టర్స్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అదేవిధంగా ఒక క్రమపద్ధతిలో పోలీస్ స్టేషన్ రికార్డులను నిర్వహించడం ద్వారా సమయం ఆదా తో పాటు పని భారం తగ్గుతుందని తెలిపారు.
పోలీస్ స్టేషన్ నందు తప్పనిసరిగా సూచిక బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.
పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేలా పోలీస్ స్టేషన్ నందు మొక్కలను విరివిగా పెంచి కాపాడాలని సూచించారు.