కృష్ణాజిల్లా గన్నవరం మండలంలో ఒకే చోట ఐదు చోట్ల పిడుగులు పడటంతో ప్రజలు భయాందోళనలో పడిపోయారు.
గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో పిడుగు పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కూడా జరిగింది.
ట్రాక్టర్ తో పొలం దున్నుతున్న వ్యక్తిపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలో తాటి చెట్టు పై పిడుగు పడి మంటలు చెలరేగాయి.
విజయవాడ రూరల్ మండలం నిడమానూరు రామనగర్ లో బిల్డింగ్ పైన పిడుగు పడడంతో బిల్డింగ్ పెచ్చులు ఊడి పక్కనే ఉన్న రేకులు షెడ్డుపై పడ్డాయి.
రేకులు పగిలి ఇంట్లోకి దూసుకుపోవడం తో 5 సం ల షహీనా అనే పాపకి స్వల్ప గాయాలు తగిలాయి.