కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కూచిపూడి వైన్ షాపు దగ్గర నిన్న రాత్రి జరిగిన ఇరువర్గాల దాడిలో ఒక వ్యక్తి మరణించాడు. అయ్యంకి మాజీ ఎం పి టీ సి అయిన మద్దాల కోటేశ్వరావు పై ప్రత్యర్థులు దాడి చేసి హత్య చేశారు.
రాత్రి కూచిపూడి వైన్ షాప్ వద్ద జరిగిన దాడిలో మరణించిన కోటేశ్వరరావు కేసులో న్యాయం చేయాలంటూ గ్రామస్తులు నేడు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయింపు నిర్వహించారు. కూచిపుడి పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై అయ్యంకి గ్రామస్తులు పెద్ద ఎతున వచ్చి ఆందోళన చేస్తుండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.