కడప జిల్లా కొండాపురం మండలం పి అనంతపురంలో గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రామ సుబ్బారెడ్డి,ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ముంపు చెక్కుల ఎంపిక సర్వేలో లో ఈ ఘర్షణ మొదలైంది.
ఈ ఘటన లో గురునాధ్ రెడ్డి అనే వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందంగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి గురునాథ్ రెడ్డి రామసుబ్బారెడ్డి వర్గం కు చెందిన వాడు.
గాయపడిన వారిని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు.
గండికోట నిర్వాసితులకు అందించే చెక్కుల విషయంలో ఈరోజు రి సర్వే చేయనున్న అధికారుల ఎదుట గ్రామంలో ఒకరిపై ఒకరు చాడీలు చెప్పారని ఆరోపించుకుంటుండగా ఘర్షణ జరిగింది.