ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కొత్వాల్ గూడ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి గచ్చిబౌలి వెళ్తున్న క్యాబ్ కొత్వాల్ గూడా వద్దకు రాగానే లారీని వెనుక నుంచి ఢీకొన్నది. ఈ ప్రమాదంలో క్యాబ్ లోని ఇండిగో ఎయిర్ లైన్స్ పైలెట్ మహేందర్ సింగ్ అక్కడికక్కడే మరణించారు.
డ్రైవర్ శివ శంకర్ కు తీవ్ర గాయాలు తగలడంతో ఆస్పత్రికి తరలించారు.