గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించారు. పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేటలో సాయిబాబా గుడి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు బైకు పై వస్తున్న వ్యక్తిని ఢీ కొన్నది. దాంతో బైకు పై వస్తున్న అన్నవరపు హనుమంతరావు అనే 60 సంవత్సరాల వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.
స్థానిక అచ్చంపేట పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. హనుమంతరావు స్థానికంగా ఒక హోటల్ నిర్వహిస్తుంటాడు.