28.7 C
Hyderabad
April 25, 2024 05: 54 AM
Slider నిజామాబాద్

క్రేన్, ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరి మృతి

#RoadAccident

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం  మండలంలోని చిన్న కొడప్గల్ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనానికి క్రేన్ ఢీ కొనడంతో ఒకరు మృతి చెందారు.

ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం పిట్లం మండలం చిన్న కొడప్గల్ గ్రామానికి చెందిన కుర్మ రామ్ గొండ (33) అతని పొలం వద్ద పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా అదే రోడ్డులో వెనుక నుంచి వేగంగా వస్తున్న క్రేన్ ద్విచక్ర వాహనానికి ఢీకొనడంతో రామ్ గొండ అక్కడికక్కడే మృతి చెందారు.

సంఘటన స్థలంలో సభ్యుల రోదన అందరినీ కలిచివేసింది. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని భార్య బాగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు.

Related posts

ధాన్యం కొనుగోలులో ఇబ్బంది రానివ్వం

Murali Krishna

ఎటాక్: కేరళ బీజేపీ కార్యదర్శి పై మసీదులోనే దాడి

Satyam NEWS

కుట్ర ఎవరు చేశారో వై ఎస్ షర్మిలే చెప్పాలి

Satyam NEWS

Leave a Comment