29.2 C
Hyderabad
March 24, 2023 21: 45 PM
Slider వరంగల్

ఆటో కరెంటు స్తంభానికి ఢీకొని మహిళ మృతి

#roadaccident

ములుగు జిల్లాలో కూలి పనికి వెళ్లే మహిళలు ప్రయా నిస్తున్న ఆటో విద్యుత్ స్తంభానికి ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన 15 మంది మహిళలు ఆటోలో తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామానికి వరి నాట్ల కోసం కూలికి వెళ్తున్నారు. నార్లాపూర్ గ్రామంలో కూలీలు వెళ్తున్న ఆటో అదుపుతప్పి కరెంటు పోల్కి ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళల్లో ముందు కూర్చున్న ఎల్ల బోయిన సునీత (35) ఘటనా స్థలంలోనే మృతి చెందగా బానోత్ జ్యోతి పరిస్థితి విషమంగా వుంది. మిగతా కూలీలలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు గాయపడిన వారిని 108కి సమాచారం అందించి, ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

మృతవీర సైనికులకు జోహార్లు

Satyam NEWS

సైబర్ నేరాన్ని ఛేదించిన ములుగు సైబర్ పోలీసులు

Satyam NEWS

విక్రమ్ ల్యాండర్ పై ఆశ వదులుకోవాల్సిందేనా?

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!