39.2 C
Hyderabad
March 29, 2024 16: 57 PM
Slider నిజామాబాద్

లారీ ఢీకొని యువకుడి మృతి మరొకరికి గాయాలు

#roadaccident

కామారెడ్డి జిల్లా జుక్కల్ పోలీసు పరిధిలో ఘోరం చోటుచేసుకుంది. నూతనంగా నిర్మిస్తున్న  161 జాతీయ   నాలుగు వరుసల  రహదారి పైనా  బైక్, లారీ ఢీకొనడంతో బిచ్కుందకు చెందిన  పత్తి సాయి  25 యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.  యువకునితో పాటు సన్నీ అనే యువకునికి  తీవ్ర  గాయాలు కాగ చికిత్స నిమిత్తం నిజామాబాదు అస్పత్రి కి తరలించారు.జుక్కల్ మండలం కౌలస్ గేట్ సమీపంలో అదుపు తప్పిన లారీ కూడా బోల్తా పడింది. డ్రైవర్ క్లీనర్ పరారీలో ఉన్నారు. పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని  పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాన్స్వాడ ఆస్పత్రికి తరలించారు. దీంతో బిచ్కుంద మండల కేంద్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

జీ. లాలయ్య సత్యం న్యూస్ రిపోర్టర్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

కొల్లాపూర్ ప్రాంతంలో పట్టుబడ్డ నాటు సారా

Satyam NEWS

ఈడి రిపోర్ట్ లో కవిత పేరు

Murali Krishna

నరసరావుపేట ఎల్.ఐ.సి కార్యాలయం ముందు ఒక రోజు సమ్మె

Satyam NEWS

Leave a Comment