కడప జిల్లా రాజంపేట మండలం ధనాసిపల్లె సమీపంలో గురువారం తెల్లవారుజామున కరుటూరి వీరేష్ అనే వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడు. మృతుడు గూడ్స్ రైలు లో వెళుతూ ప్రమాద వశాత్తు కిందపడి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.
మృతుడి ఆధార్ కార్డు ఆధారంగా పశ్చిమ గోదావరి జిల్లా వుండ్రాజ వరం లోని వెంకట రావు కుమారుడుగా పోలీసులు నిర్ధారణ వచ్చారు. బస్సులు,ట్రైన్ లు లేకపోవడంతో గూడ్స్ లో రహస్యంగా ప్రయాణిస్తున్న తరుణంలో ప్రమాద వశాత్తు ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పంచనామాకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.