కడప జిల్లా మైదుకూరు-బద్వేల్ జాతీయ రహదారిపై నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
జెడ్ కొత్తపల్లె గ్రామ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రొద్దుటూరు నుండి నెల్లూరు కి టాటా ఏసీ బండి లో వెళ్తుండగా జడ్. కొత్త పల్లి వద్ద చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంపై బి. మఠం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు