కరోనా వ్యాక్సిన్ వికటించడంతో ఒంగోలు రిమ్స్ వైద్యురాలు ధనలక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఈనెల 23న రిమ్స్లో డాక్టర్ ధనలక్ష్మి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
ఆమె 25 నుండి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. వెంటనే ధనలక్ష్మిని రిమ్స్కు తరలించారు.
రిమ్స్లో చికిత్స అనంతరం అధికారులు వైద్యురాలిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
అయితే డాక్టర్ ధనలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైకి తరలించారు.
ఆమె అస్వస్థతకు కారణాన్ని వైద్య నిపుణులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది.