24.7 C
Hyderabad
March 29, 2024 05: 27 AM
Slider వరంగల్

మైనర్ గిరిజన బాలికపై వైద్యుడి అత్యాచారం

warangal

వరంగల్ జిల్లాలో మరో ఘోరం జరిగింది. గిరిజన విద్యార్థిని పై ఆర్ఎంపీ వైద్యుడు అత్యాచారం చేసి సభ్య సమాజం తలదించుకునేలా చేశాడు. హనుమకొండ జులైవాడ ఎస్టీ హాస్టల్ లో చదువుకుంటున్న 14 ఏళ్ల విద్యార్థిని కళ్ళలో నీరుకారుతుంటే స్థానిక ఆర్ఏంపీ వైద్యుడు రాజును శుక్రవారం రోజు సంప్రదించింది.

బాలికను పరీక్షించిన వైద్యుడు రాజు ఆమెకు చికిత్స నిర్వహిస్తున్నట్లు నటించి మత్తుమందు ఇచ్చి విద్యార్థిని పై అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు వదిలిన అనంతరం విషయాన్ని గ్రహించిన ఆ బాలిక ఏడ్చుకుంటు హాస్టల్ కి వెళ్ళి తరువాత ఫోన్ లో ములుగు జిల్లాలో ఉండే తమ తల్లిదండ్రులుకు సమాచారం ఇచ్చింది.

సుబేదారి పోలీసులకు పిర్యాదు చేయడంతో నిందితుడు రాజు పై ఫాక్స్లో యాక్ట్ సెక్షన్ల ప్రకారం  కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

దేశం ముందుకు వెళ్లేందుకు ఇస్లాం మతచట్టాల మార్పు

Satyam NEWS

కాజ గ్రామంలో భార్యా భర్తల ఆత్మహత్య

Satyam NEWS

హుజూర్ నగర్ పట్టణ ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

Satyam NEWS

Leave a Comment