విజయవాడలో దారుణం జరిగింది. తెలంగాణ నుంచి కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు బలవన్మరణం పాలవ్వడం దిగ్భ్రాంతి కలిగించింది. బెజవాడలోని కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లీ, కొడుకు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కృష్ణానదిలో దూకి తండ్రీ, కొడుకు గల్లంతు అయ్యారు. మృతులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
previous post
next post