32.2 C
Hyderabad
March 28, 2024 23: 29 PM
Slider వరంగల్

ఒక రైతు ప్రాణం తీసిన వరి కోత మిషన్

#DeadBody

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం లో ఈ దారుణం జరిగింది.

రుద్రారం గ్రామానికి చెందిన బొమ్మారపు శ్రీనివాస్ (45) అనే రైతు తన వరి పొలాన్ని వరికోత మిషన్ తో కోయిస్తున్నాడు.

గురువారం రాత్రి 7 గంటలకు  పొలాన్ని కోయిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున గాలిదుమారం వచ్చింది. దాంతో ప్రమాదవశాత్తు శ్రీనివాస్ వరి కొత మిషన్ పై పడ్డాడు.

ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన అతన్ని  గమనించిన డ్రైవర్, గ్రామస్తులు చికిత్స కోసం భూపాలపల్లి, అక్కడి నుంచి వరంగల్ తీసుకుపోయి చికిత్స అందించారు.

అయితే రాత్రి అతను మృతి చెందాడు.

శుక్రవారం అతని భార్య ఫిర్యాదు మేరకు మృత దేహాన్నీ పోస్టుమార్టం కోసం మహాదేవపూర్ ఆసుపత్రికి తరలించారు.

Related posts

తెలంగాణను ముంచెత్తుతున్న భారీ వర్షాల పట్ల అప్రమత్తం

Satyam NEWS

మార్చి 26 నుండి విజయవాడ టూ షిర్డీ విమానం

Murali Krishna

బీఆర్ఎస్ లో చేరిన నాచారం సీనియర్ సిటిజన్లు

Satyam NEWS

Leave a Comment