జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం లో ఈ దారుణం జరిగింది.
రుద్రారం గ్రామానికి చెందిన బొమ్మారపు శ్రీనివాస్ (45) అనే రైతు తన వరి పొలాన్ని వరికోత మిషన్ తో కోయిస్తున్నాడు.
గురువారం రాత్రి 7 గంటలకు పొలాన్ని కోయిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున గాలిదుమారం వచ్చింది. దాంతో ప్రమాదవశాత్తు శ్రీనివాస్ వరి కొత మిషన్ పై పడ్డాడు.
ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన అతన్ని గమనించిన డ్రైవర్, గ్రామస్తులు చికిత్స కోసం భూపాలపల్లి, అక్కడి నుంచి వరంగల్ తీసుకుపోయి చికిత్స అందించారు.
అయితే రాత్రి అతను మృతి చెందాడు.
శుక్రవారం అతని భార్య ఫిర్యాదు మేరకు మృత దేహాన్నీ పోస్టుమార్టం కోసం మహాదేవపూర్ ఆసుపత్రికి తరలించారు.