36.2 C
Hyderabad
April 25, 2024 20: 06 PM
Slider ప్రత్యేకం

ట్రాజెడీ: దీపం వెలిగిస్తూ ఆరిపోయిన యువతి జీవితం

fire accedent

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గౌరారం గ్రామంలో గుడిసెకు నిప్పంటుకుని యువతి మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే బుడల సౌందర్య (18) అనే అమ్మాయి తల్లిదండ్రులు నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి గ్రామంలో ఉండేవారు. తల్లిదండుల మధ్య వివాదాలు రావడంతో తండ్రి ధర్మారెడ్డి గ్రామంలోనే ఉంటున్నాడు.

సౌందర్యం మాత్రం తల్లితో కలిసి అమ్మమ్మగారిళ్లు అయిన గౌరారంలో ఉంటూ బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతోంది. అయితే ప్రతి రోజు మాదిరిగానే పాత గుడిసెలో దీపం వెలిగించడానికి సౌందర్య గుడిసెలోకి వెళ్లి దీపం వెలిగించిన అనంతరం ప్రమాదవశాత్తు గుడిసెకు నిప్పంటుకుని గుడిసె పూర్తిగా కాలిపోయింది. అదే గుడిసెలో ఉన్న సౌందర్య పూర్తిగా కాలిపోయింది.

స్థానికులు గమనించినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పీ చూడగా పూర్తిగా కాలిన సౌందర్య మృతదేహం బయటపడింది. దాంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Satyam NEWS

ఏపి రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్

Satyam NEWS

కూటమి పేరులో ఇండియా ఉంటే సరిపోదు

Bhavani

Leave a Comment