ప్రేమ వ్యవహారం ప్రాణం తీసేంత వరకూ వచ్చింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లో ఈ సంఘటన జరిగింది. కొడవటూర్ కామన్ సమీపంలో కొన్నే గ్రామానికి చెందిన పేర్ని శ్రీధర్ పై కొందరు వ్యక్తులు దాడి, కత్తితో పొడిచారు.
ఆ సమయంలో రోడ్డుపై ఎవరో వాహనదారులు వస్తుండటంతో హత్యాప్రయత్నంలో ఉన్న దుండగులు పరారయ్యారు. సమాచారం అందడంతో బాధితుడిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ పేర్ని శ్రీధర్ మరణించాడు.