హైదరాబాద్ శివారులోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధి లోని మల్లాపూర్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది.
నేహా అనే మహిళ సోయల్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
గత రాత్రి భర్త లేని సమయంలో నేహా, సోయ ల్ ను ఇంటికి పిలిపించుకుంది.
అయితే అదే సమయంలో భర్త ఇంటికి వచ్చాడు. భర్త మొయినుద్దీన్ భార్య నేహా ను, ప్రియుడు సోయ ల్ గదిలో చూసి నిలదీయడం తో నేహా ప్లేట్ ఫిరాయించి, సోయ ల్ నన్ను బలవంతం చేయబోయాడు అని చెప్పడంతో భార్యాభర్తలిద్దరూ కలిసి సోయల్ గొంతు కోసి హత్య చేశారు.
అనంతరం భార్యాభర్తలిద్దరూ నాచారం పోలీస్ స్టేషన్ లో లొంగి పోయారు.