నెల్లూరుజిల్లా సూళ్లూరుపేట కోళ్లమిట్టలో యువకుల మధ్య చెలరేగిన ఘర్షణ హింసకు దారితీసింది.
నిన్న రాత్రి 10 గంటలకు షటిల్ ఆడుతున్న సమయంలో చోటుచేసుకొన్న ఈ వివాదం లో ఒక యువకుడు కత్తి పోట్లకు గురయ్యాడు.
ప్రాధమిక సమాచారం మేరకు 10 మంది వ్యక్తులు షటిల్ కోర్టులో బ్యాడ్మింటన్ ఆడుతున్న సమయంలో అనిల్ కుమార్, మణికంఠ అనే ఇద్దరు వ్యక్తులతో పవన్, సాయి అనే యువకులు ఘర్షణకు దిగారు.
ఉద్రిక్తతకు లోనైన వారు సమీపంలోని ఇంటి వద్ద నుండి తీసుకొచ్చిన కత్తితో అనిల్ కుమార్ పై విచక్షణ రహితంగా దాడిచేసి చంపేసారు.
మరో యువకుడు మణికంఠకు తీవ్రగాయాలైనాయి. సమాచారం అందుకొన్న పోలీసులు హుటాహుటిన సంఘటన ప్రాంతానికి చేరుకొని సమీప హాస్పిటల్ కు తరలించారు.