31.7 C
Hyderabad
April 19, 2024 02: 32 AM
Slider నెల్లూరు

షటిల్ ఆట వివాదంలో ఘర్షణ: ఒక యువకుడి మృతి

Crime scene

నెల్లూరుజిల్లా సూళ్లూరుపేట కోళ్లమిట్టలో యువకుల మధ్య చెలరేగిన ఘర్షణ హింసకు దారితీసింది.

నిన్న రాత్రి 10 గంటలకు షటిల్ ఆడుతున్న సమయంలో చోటుచేసుకొన్న ఈ వివాదం లో ఒక యువకుడు కత్తి పోట్లకు గురయ్యాడు.

ప్రాధమిక సమాచారం మేరకు 10 మంది వ్యక్తులు షటిల్ కోర్టులో బ్యాడ్మింటన్ ఆడుతున్న సమయంలో అనిల్ కుమార్, మణికంఠ అనే ఇద్దరు వ్యక్తులతో పవన్, సాయి అనే యువకులు ఘర్షణకు దిగారు.

ఉద్రిక్తతకు లోనైన వారు సమీపంలోని ఇంటి వద్ద నుండి తీసుకొచ్చిన కత్తితో అనిల్ కుమార్ పై విచక్షణ రహితంగా దాడిచేసి చంపేసారు.

మరో యువకుడు మణికంఠకు తీవ్రగాయాలైనాయి. సమాచారం అందుకొన్న పోలీసులు హుటాహుటిన సంఘటన ప్రాంతానికి చేరుకొని సమీప హాస్పిటల్ కు తరలించారు.

Related posts

హైటెన్షన్: కామారెడ్డి రైతుల ధర్నా నేపథ్యంలో పోలీసు పహారా

Satyam NEWS

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మందు నీళ్ల స్ప్రే

Satyam NEWS

విజయ్ మాల్యా పాత్రలో అనురాగ్ కశ్యప్

Satyam NEWS

Leave a Comment