వేరే రాష్ట్రం నుంచి వచ్చి కూలిపని చేసుకుంటున్న ఒక వ్యక్తి అక్రమ సంబంధం కారణంగా హతుడయ్యాడు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలోని జరిగింది. అక్కడి ఇటుక బట్టిలో ఒడిసా నుంచి వచ్చిన డంబ్రూమాజి(25) కూలి పని చేసుకునేవాడు. నాంగ్ సుపాలి శివో అనే వ్యక్తి భార్యతో అతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న శివో మాటు వేసి వారినిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. డంబ్రూమాజి చేతులు కట్టేసి కర్రతో కొట్టి చంపేశాడు. భార్య కరుణావత్ అడ్డు రావటంతో ఆమెను తల పై గాయపరిచాడు. పోలీసులు రంగప్రవేశం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
previous post