40.2 C
Hyderabad
April 19, 2024 16: 16 PM
Slider హైదరాబాద్

బంజారాహిల్స్ పోలీసులపై మత్తులో ఉన్న యువ‌తి దాడి

b Police

మద్యం మత్తులో అపస్మారకంగా పడివున్న ఓ యువతిని బంజారాహిల్స్ పోలీసులు కాపాడి, స్టేషన్ కు తీసుకురాగా, మెలుకువ వచ్చిన తరువాత ఆమె హ‌ల్‌చ‌ల్‌ చేసింది. నిన్న రాత్రి లీసా అనే యువతి రోడ్డుపై పూటుగా మ‌ద్యం సేవించి పడి ఉండటాన్ని గమనించిన పోలీసులు, ఆమెను స్టేషన్ కు చేర్చారు. ఆ యువతి పోలీస్ స్టేషన్ నుండి పారిపోయేందుకు ప్రయత్నించగా, మహిళా పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను గట్టిగా పట్టుకుని అదుపు చేసిన పోలీసులు, వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా, అంతు చూస్తానని బెదిరించింది. లీసా నాగాలాండ్ నుంచి వచ్చిందని, మాదాపూర్ ప్రాంతంలోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తోందని పోలీసులు గుర్తించారు. ఇక ఆమె డ్రగ్స్ తీసుకుందా.. లేక మద్యం మత్తులో ఉందా అన్న విషయాన్ని తేల్చేందుకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఆపై ఆమె తల్లిదండ్రులను పిలిపించి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

Related posts

మ‌హిళా ర‌క్ష‌ణ డిమాండ్‌తో విజ‌య‌న‌గ‌రంలో టీడీపీ కొవ్వొత్తుల ర్యాలీ

Sub Editor

మధుప్రియ తాజా సంచలనం: మగువా మజాకా ఊర్వశి ఓటిటిలో!!

Satyam NEWS

అత్తా కోడళ్ల చేనేత వస్త్రాల షాపింగ్ సందడి

Satyam NEWS

Leave a Comment