ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల పరిషత్ తలకొండపల్లి, లయన్స్ క్లబ్ ఆఫ్ అమన్గల్ వారి సౌజన్యంతో ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ తలకొండపల్లి ఆమన్గల్ కడ్తాల్ మాడ్గుల మండలాల్లో ప్రతి ఇంటికి ఒక బాటిల్ చొప్పున లక్ష శానిటైజర్ బాటిళ్లను పంపిణీ చేయడంలో భాగంగా వెల్జాల్ గ్రామంలో ప్రారంభించారు.
ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా కరోనా మహమ్మారిని దరిచేరనీయకుండా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి సింగిల్ విండో వైస్ చైర్మన్ కూన రవికుమార్ ఉపసర్పంచి అజీజ్ ఎం పి టి సి అంబాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు గోపాల్ నాయక్ మాజీ ఎంపిటిసి శ్రీనివాస మూర్తి గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.