విశాఖలో మరో కరోనా విషాదం చోటు చేసుకుంది.
కరోనాతో కేజీహెచ్ లో కీర్తి (14) అనే బాలిక మృతి చెందింది. మూడు రోజుల క్రితం ప్రైవేట్ హాస్పటల్ నుండి కేజీహెచ్ కి కీర్తిని తరలించారు.
అయితే బాలిక కండిషన్ ను బంధువులకు కేజీహెచ్ వైద్యులు తెలియజేయలేదు.
బంధువులు ఆందోళనకు దిగడంతో cc tv ఫుటేజ్ ల ద్వారా ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు చూపించి ఆపై మృతి చెందినట్లు వెల్లడించారు.
ఆసుపత్రి వద్ద బంధువులు రోదన…ఆందోళన…తో చూపరులకు కంటనీరు తెప్పించింది. మృతి చెందిన బాలిక 8వ తరగతి చదువుతుంది…