ఢిల్లీ అల్లర్ల వీడియోకు తన ఆడియో జత చేసి అభూత కల్పనలతో సోషల్ మీడియాలో పోస్టింగులు చేస్తున్న ఒక వ్యక్తిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్న రహ్మత్ షరీఫ్ అనే 29 ఏళ్ల స్కూల్ వ్యాన్ డ్రయివర్ వీడియో మెసేజీలు రూపొందించి అందరికి ఫార్వర్డ్ చేస్తున్నాడు.
సోషల్ మీడియాపై నిఘా వేసి ఉంచిన సైబర్ క్రైం పోలీసులు రహ్మత్ షరీష్ చేస్తున్న ఈ పనులను గమనించారు. దాంతో సుమోటోగా అతడిపై కేసు నమోదు చేసి వలపన్నారు. వాట్సప్ లో మత కలహాలను రెచ్చ గొట్టే విధంగా అతడు పంపుతున్న మెసేజీలను గమనించి అతడిని అరెస్టు చేశారు.