కృష్ణా జిల్లా నూజివీడు మండలం తుక్కులూరుకు చెందిన ఓ వ్యక్తి మచిలీపట్నంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని షేక్ మస్తాన్ గా గుర్తించారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో డిసెంబరు 27న మచిలీపట్నం దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. ఇంతలో గత రాత్రి చింతగుంటపాలెంలో భర్త షేక్ మస్తాన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అతడిని మచిలీపట్నం జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లుగా డాక్టర్ల నిర్థారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
next post