ప్రభుత్వం మద్యం అమ్మకాలు మొదలు పెట్టడంతో పాపం అతను ఫుల్లుగా తాగేశాడు. ఎక్కడ ఉండాలో తెలియక బాగా తాగి ఇంటికి వచ్చాడు. భార్య గొడవ పెట్టింది. అంతే అతను మనస్థాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా,గుడు పల్లి మండలం గోoకారం పల్లె లో ఈ ఘటన జరిగింది.
గజేంద్ర అనే వ్యక్తి తాగి వచ్చి మద్యం తాగిన మత్తులో భార్యతో గొడవకు దిగాడు. తాగి వచ్చిన తనను భార్య అవమానించిందని భావిచిన గజేంద్ర మనస్తాపానికి గురయ్యాడు. దాంతో ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని మరణించాడు. కుటుంబంపై మద్యం విసిరిన యమపాశంతో ఆ కుటుంబం రోడ్డున పడ్డది.